హైదరాబాద్ : ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ చీఫ్ ఇంజినీర్ వీ వెంకటాచారి (92) మరణించారు. దాదాపు నలభై ఆరు సంవత్స రాలు నీటి పారుదలశాఖలో వివిధ హోదాల్లో ఆయన పనిచేశారు.
తెలుగుగంగ, పోలవరం ప్రాజెక్టుల రూప కల్పనలో కీలక పాత్ర పోషించారు. చెన్నారెడ్డి, ఎన్టీఆర్ ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు వారితో కలిసి పనిచేశారు.
నల్గొండ జిల్లాలో వైష్ణవ కుటుంబంలో జన్మించిన వెంకటాచారి తెలంగాణలోని పలు నీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం విశేష కృషి చేశారు.
ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. వెంకటాచారి మరణం పట్ల పలువురు నీటిపారుదల నిపుణులు విచారం వ్యక్తంచేశారు. జూబ్లీహిల్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరిగాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి