ముంబై: ఒక వ్యక్తి కౌన్సిలర్గా ఎన్నికైనప్పటికీ తన వృత్తిని మానలేదు. ఎప్పటిలాగే రోడ్డు పక్కన మొక్కజొన్నలను కాల్చి అమ్ముతున్నాడు. మహారాష్ట్ర వాషిమ్ జిల్లా కరంజా నగరానికి చాంద్ షా, రోడ్డు పక్కన బండి పెట్టుకుని కాల్చిన మొక్కజొన్నలు విక్రయిస్తాడు. అయితే ఆయన ఇటీవల కౌన్సిలర్గా ఎన్నికయ్యాడు. అయినప్పటికీ తన వృత్తిని కొనసాగిస్తున్నాడు. ప్రతి రోజూ రోడ్డు పక్కన బండిపై మొక్కజొన్నలు కాల్చి అమ్ముతున్నాడు.
తాను గత పదేండ్లుగా మొక్కజొన్నలు కాల్చి అమ్ముతున్నానని, రోజుకు రూ.200 నుంచి రూ.300 సంపాదిస్తుంటానని చాంద్ షా తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేయమని ప్రజలు తనను ప్రోత్సహించారని, దీంతో కౌన్సిలర్గా ఎన్నికైనట్లు ఆయన చెప్పారు. అయినప్పటికీ తన వృత్తిని కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.