భువనగిరి అర్బన్, ఏప్రిల్ 9: పాఠశాలలు తిరిగి తెరిచే వర కు ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులకు, బోధనేతర సి బ్బందికి ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కరోనా ఉదృతి నేప ధ్యంలో విద్యా సంస్థలు తాత్కాలికంగా మూసివేయడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న గుర్తింపు పొందిన ప్రైవేటు విద్యాసంస్థల ఉపాధ్యాయులు, సిబ్బందిని ఆదుకోవాలని ముఖ్యమంత్రి నిర్ణయించినందున పాఠశాలలు తిరిగి తెరిచే వరకు కుటుంబానికి నెలకు రెండు వేల సాయంతో పాటు రేషన్ దుఖానాల ద్వారా 25 కిలోల బియ్యం ఉచితంగా అందించడంపై శుక్రవారం పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ ఇత ర ఉన్నతాధికారులతో కలసి మంత్రి జిల్లా కలెక్టర్లు, అదన పు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి విధి విధానా లపై చర్చించారు. కరోనా కష్టకాలంలోనూ ఏ రాష్ట్రంలో లేనివిధంగా సీఎం కేసీఆర్ ప్రైవేటు స్కూలు ఉపాధ్యాయు లను ఆదుకునేందుకు మానవీయ దృక్పధంతో అండగా ని లిచారని మంత్రి అన్నారు.
ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రం లోని 10,500ల ప్రైవేటు పాఠశాలలకు సంబంధించి 1, 45,000ల ఉపాధ్యాయులకు బోధనేతర సిబ్బందికి ప్ర యోజనం చేకూరగలదని మంత్రి అన్నారు. జిల్లా కలెక్టర్లు ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు క్షేత్రస్ధాయిలో అర్హులైన ప్రతీ ఒక్క ప్రైవేటు ఉపాధ్యాయుడు సిబ్బందిని గుర్తించి ప్ర భుత్వ సహాయాన్ని అందించాలని కోరారు. మార్చి 2020 నాటికి అందుబాటులో ఉన్న జాబితా వివరాలను సరి చూ సుకొని ఆధార్, బ్యాంకు ఖాతా తదితర వివరాలను ధృవీ కరించి ప్రభుత్వానికి సమర్పించాలని అధికారులకు సూ చించారు. ఆన్లైన్లో మనీ ట్రాన్స్ఫర్, చౌక దుఖానాల ద్వారా 25 కిలోల బియ్యం పంపిణీ చేపట్టాలని మంత్రి కోరారు. పౌర సరఫరాల శాఖ మంత్రి మాట్లాడుతూ ప్రైవే టు ఉపాధ్యాయులకు, బోధనేతర సిబ్బందికి బియ్యం పం పిణీ విధానాన్ని పౌర సరఫరాల అధికారులు పర్యవేక్షిం చాలని కోరారు.
రాష్ట్ర మున్సిపల్ పరిపాలన పట్టణాబివృద్ది శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అర్వింద్ కుమార్ మాట్లాడుతూ వచ్చే నాలుగు రోజుల్లో ఫ్రంట్ లైన్ వారియర్స్గా పనిచేస్తు న్న మున్సిపాలిటీలోని పారిశుధ్య కార్మికుడి నుంచి మున్సి పల్ కమిషనర్ స్థాయి వరకు ప్రతీ ఒక్కరూ వ్యాక్సినేషన్ తీసుకునేలా జిల్లా కలెక్టర్లు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా వ్యాక్సినేషన్ తీసుకునేలా అన్ని చర్యలు తీసుకోవాలని ఆ శాఖ కార్యదర్శి సందీన్ కుమార్ సుల్తానియా జిల్లా కలెక్ట ర్లను కోరారు. వీడియో కాన్ఫరెన్స్లో ప్రభుత్వ సలహాదా రు రాజీవ్ శర్మ, విద్యాశాఖ కార్యదర్శి చిత్ర రామచంద్రన్, బీఆర్కేఆర్ భవనం నుంచి పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, డీఈవో చైతన్య జైనీ, జిల్లా పౌర సరఫరాల మేనేజర్ గోపీకృష,్ణ జిల్లా పౌరసరఫరాల అధికారి బ్రహ్మ రావు తదితరులు పాల్గొన్నారు.
ఇవీ కూడా చదంవడి…
చకచకా గ్రేటర్ ఎన్నికల ఏర్పాట్లు