ముంబై: దేశంలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ ప్రభావం క్రమంగా తగ్గుతున్నది. ఒక దశలో రోజుకు నాలుగు లక్షల యాభై వేలు దాటిన కేసుల సంఖ్య క్రమంగా తగ్గి 1.27 లక్షలకు చేరుకుంది. అయితే మహారాష్ట్రలోని అహ్మద్నగర్ సిటీలో ఒకే నెలలో (మే 1 నుంచి 31 వరకు) 9,928 మంది మైనర్లు కరోనా బారిపడ్డారు. అహ్మద్నగర్ సిటీ ప్రధాన వైద్యాధికారి డాక్టర్ సునీల్ పోకర్నా ఈ విషయాన్ని వెల్లడించారు.
దేశంలో ఓవరాల్ పాజిటివిటీ రేటుతోపాటే మైనర్లలో పాజిటివిటీ రేటు కూడా పెరిగిందని డాక్టర్ సునీల్ పోకర్నా చెప్పారు. ఏప్రిల్లో కరోనా బారినపడ్డ మైనర్ల సంఖ్య 7,760 కాగా, మే నెలలో ఆ సంఖ్య 9,928కి పెరిగిందని తెలిపారు. అయితే, మైనర్లలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నా ఏ ఒక్కరిలోనూ సీరియస్గా లేదని పేర్కొన్నారు.