ముంబై : యూపీఏ చీఫ్గా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నాయకత్వ పగ్గాలు చేపట్టాలని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలపై మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలె స్పందించారు. యూపీఏను సమర్ధంగా నడిపించే సత్తా సోనియా గాంధీకి ఉందని, చాలా ఏండ్ల నుంచి ఆమె యూపీఏకు సారథ్యం వహిస్తున్నారని నానా పటోలె శుక్రవారం పేర్కొన్నారు.
యూపీఏ చైర్పర్సన్ వ్యవహారంపై చర్చ అవసరం లేదని స్పష్టం చేశారు. కాగా సోనియా గాంధీ యూపీఏ చీఫ్గా సమర్ధంగా పనిచేశారని కానీ ఆమె ఆరోగ్యం సహకరించకపోవడం, రాజకీయాల్లో చురుకుగా లేని కారణంగా శరద్ పవార్ యూపీఏ నాయకత్వ బాధ్యతలు స్వీకరించాలని సంజయ్ రౌత్ పేర్కొన్న నేపథ్యంలో నానా పటోలె ఈ వ్యాఖ్యలు చేశారు.