భోపాల్: మధ్యప్రదేశ్లో మొదటిసారిగా డెల్టా ప్లస్ వేరియంట్తో కరోనా రోగి మరణం నమోదయ్యింది. ఉజ్జయినిలోని ఓ దవాఖానలో చికిత్స పొందుతున్న కరోనా రోగి డెల్టా ప్లస్ వేరియంట్ లక్షణాలతో మృతిచెందినట్లు అధికారులు దృవీకరించారు. రాష్ట్రంలో ఐదుగురికి డెల్టాప్లస్ వైరస్ సోకింది. అందులో నలుగురు కోలుకున్నారని, ఒక మహిళా రోగి మరణించారని ఉజ్జయిని నోడల్ అధికారి చెప్పారు. అందులో ముగ్గురు భోపాల్కు చెందినవారుకాగా, మరో ఇద్దరు ఉజ్జయినికి సంబంధించినవారని తెలిపారు. మరణించిన కొవిడ్ రోగి నుంచి తీసిన నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ చేయగా అది డెల్టా ప్లస్ వేరియంట్ అని తేలిందన్నారు.
కాగా, సార్ట్ కొవిడ్-2 డెల్టా ప్లస్ వేరియంట్ ప్రబలిన నేపథ్యంలో రాష్ట్రంలో భారీగా పరీక్షలు నిర్వహిస్తున్నామని మంత్రి విశ్వస్ సారంగ్ చెప్పారు. డెల్టా ప్లస్ వేరియంట్ రోగుల కాంటాక్టు ట్రేసింగ్ జరుగుతుందన్నారు. ఈ వైరస్ సోకిన ఐదుగురిలో నలుగురు వ్యాక్సిన్ వేయించుకున్నారని, వారంతా కోలుకున్నారని, కానీ టీకా తీసుకోని రోగి మరణించారని వెల్లడించారు. అర్హులైనవారంతా టీకాలు వేయించుకోవాలని ఆయన కోరారు.