కేపీహెచ్బీ కాలనీ, జూలై 6 : టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే సబ్బండ వర్గాలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. మంగళవారం కూకట్పల్లి కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో హనుమాన్నగర్కు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎం.విఠల్ అతడి అనుచరులతో కలిసి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ.. ఎనిమిదేండ్ల టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం దేశంలోనే అభివృద్ధిలో నంబర్వన్గా నిలిచిందని, మరోవైపు ప్రతి గడపకూ సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్దన్నారు. కేసీఆర్ లాంటి నాయకుడి పరిపాలన తీరుకు ఆకర్షితులై కాంగ్రెస్, ఇతర పార్టీల నేతలు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. పార్టీలో చేరిన వారిలో టి.నర్సింహులు, జి.ఎర్రన్న, జి.రాములు, కె.కాసీమ్, టి.శంకర్, కె.మల్లేశ్, పరమేశ్, శ్రీనివాస్, రాము, అరుణ్, మహేశ్, భాస్కర్ తదితరులు ఉన్నారు.