భోపాల్: కరోనా మహమ్మారి బారినపడి మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే మృతిచెందారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం అలీరాజ్పూర్ జిల్లాలోని జాబాట్ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే కళావతి భూరియాకు కరోనా లక్షణాలు కనిపించడంతో ఈ నెల 15న నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో ఆమెకు కరోనా పాజిటివ్గా తేలింది.
దాంతో అప్పటి నుంచి ఆమె ఇండోర్లోని ఓ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. పరిస్థితి విషమించడంతో ఈ ఉదయం కన్నుమూశారు. 1990లో గ్రామ సర్పంచ్గా రాజకీయ జీవితం ప్రారంభించిన కళావతి భూరియా అంచెలంచెలుగా ఎదిగారు. 2018లో తొలిసారి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
ఎస్ఐని హతమార్చిన మావోయిస్టులు
కరోనా విధుల్లో కానిస్టేబుల్.. పోలీస్ స్టేషన్లోనే హల్దీ వేడుక
పంది తల, చేప చర్మం.. ఒడిశాలో వింత శిశువు జననం..!
కరోనా కల్లోలం: పేద ప్రజలకు కేంద్రం తీపి కబురు..