న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదివారం ఓ పుస్తకాన్ని రిలీజ్ చేశారు. శాసనసభలో మాట్లాడుతున్న సమయంలో కొన్ని నిషేధిత పదాలను ఆ పుస్తకంలో చేర్చారు. పప్పూ, బంటేదార్, ధోంగీ లాంటి అనుచిత పదాలను సభలో మాట్లాడుతున్న సమయంలో వినియోగించరాదు అని సీఎం అన్నారు. సుమారు 1110 నిషేధిత పదాలను ఆ పుస్తకంలో పొందుపరిచారు. 38 పేజీల ఆ బుక్లెట్ను హిందీలో రిలీజ్ చేశారు. ధోంగీ(మోసగాడు), నికమ్మ(విలువలేని), చోర్(దొంగ), బ్రష్ట్(అవినీతి), తానాషా(నియంత), గుండే( గుండాలు), జూటే బోల్నా( అబద్దాలు చెబుతున్నాడు), వ్యభిచార్ కర్నా (వ్యభిచారం) లాంటి పదాలను ఇక నుంచి అసెంబ్లీలో మాట్లాడుతున్న సమయంలో వాడరాదు. నిషేధిత పదాలతో పుస్తకం రూపొందించిన అసెంబ్లీని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రశంసించారు.