హవేళిఘనపూర్, ఏప్రిల్ 21: మండల పరిధిలోని సర్దన గ్రామంలో పీఎసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వైస్ ఎంపీపీ రాధాకిషన్యాదవ్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ రాధాకిషన్ యాదవ్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మెదక్ పీఎసీఎస్ సొసైటీ చైర్మ న్ హన్మంత్రెడ్డి, సర్దన రైతులు పాల్గొన్నారు.
మెదక్రూరల్…
మెదక్రూరల్ , ఏప్రిల్ 21: ప్రభుత్వం రైతులకు మద్దతు ధర చెల్లించేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారభింస్తుదన్ని మెదక్ పీఏసీఎస్ చైర్మన్ హనుమంత్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని మాల్కాపూర్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని మెదక్ పీఏసీఎస్ చైర్మన్ హనుమంత్రెడ్డి సర్పంచ్ సరోజమోహన్తో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో ఏఈవో రాజశేఖర్ ,గట్టయ్య , మోహన్ వార్డుసభ్యులు పాల్గొన్నారు
నిజాంపేటలో…
నిజాంపేట,ఏప్రిల్21: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని రామాయంపేట పీఏసీఎస్ చైర్మన్ చంద్రం అన్నారు. ఆయన మండలంలోని బచ్చురాజ్పల్లిలో గ్రామ సర్పంచ్ నర్సవ్వతో కలిసి పీఏసీఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సురేశ్, డైరెక్టర్ సుధాకర్రెడ్డి, సీఈవో లక్ష్మీనర్సింహులు, గ్రామస్తులు, రైతులు ఉన్నారు