న్యూఢిల్లీ, మే 22: ఈ నెల 26న (బుధవారం) ఆకాశంలో అద్భుతం జరుగనున్నది. ఈ ఏడాదిలో తొలి చంద్రగ్రహణంతోపాటు సూపర్మూన్, బ్లడ్మూన్ కూడా ఆ రోజు సంభవించనున్నాయి. చంద్రుడు భూమికి దగ్గరగా వచ్చినప్పుడు పెద్దగా, మరింత ప్రకాశవంతంగా కనిపిస్తాడు. దీనిని సూపర్ మూన్ అంటారు. బుధవారం చంద్రుడు భూమికి దగ్గరగా రానున్నాడు. మరోవైపు ఆరోజు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. చంద్రుడు, సూర్యుడు, భూమి ఒకే సరళరేఖపైకి వస్తాయి. సూర్యకాంతి నేరుగా భూమిపై పడి భూవాతావరణం గుండా పరావర్తనం చెందినప్పుడు చంద్రుడు ఎర్రగా కనబడతాడు. దీనిని బ్లడ్మూన్ అంటారు. అది కూడా బుధవారం సంభవించనుంది. ఈ సంపూర్ణ చంద్రగ్రహణం భారత్లో ఈశాన్య రాష్ర్టాల్లో పాక్షికంగా కనిపిస్తుంది.