కనీవినీ ఎరుగని రీతిలో కొత్తూరు మున్సిపాలిటీ అభివృద్ధి
దేశంలో ఎక్కడాలేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు
టీఆర్ఎస్కు సబ్బండ వర్ణాల మద్దతు
గెలుపు గుర్రాలనే బరిలోకి దింపినగులాబీ పార్టీ
రూ.15 కోట్లతో మున్సిపల్అభివృద్ధి పనులు
అంతా తానై ముందుకు నడిపిస్తున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్
ప్రతిపక్షాల పోటీ నామమాత్రమే
రంగారెడ్డి, ఏప్రిల్ 23, (నమస్తే తెలంగాణ) : కొత్తూరు మున్సిపల్ పీఠాన్ని దక్కించుకునేందుకు టీఆర్ఎస్ పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తూరును మున్సిపాలిటీగా ఏర్పాటు చేసి అభివృద్ధి కోసం రూ.15 కోట్ల నిధులను కేటాయించింది. గులాబీ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందన్న అభిప్రాయంతో సబ్బండ వర్ణాలు మద్దతు తెలుపుతున్నాయి. దీనికి తోడు గెలుపు గుర్రాలనే బరిలో దింపడంతో వార్ వన్సైడ్లా మారింది. ప్రతిపక్షాల పోటీ నామమాత్రంగానే ఉండడంతో ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలు గులాబీ పార్టీలో చేరుతున్నారు. దీనికితోడు మంత్రి శ్రీనివాస్గౌడ్ అంతాతానై గెలుపే లక్ష్యంగా ప్రచారం నిర్వహిస్తున్నారు
కొత్తూరు మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీఆర్ఎస్ ముందు కెళ్తున్నది. కొత్తూరు మున్సిపాలిటీ తొలి ఎన్నికల్లో పక్కా వ్యూహంతో ప్రచారం చేస్తున్నది. టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలతో కొత్తూరు మున్సిపా లిటీనీ కైవసం చేసుకునేందుకు మంత్రి శ్రీనివాస్గౌడ్ స్థానిక ముఖ్య నేతలతోపాటు గులాబీ శ్రేణులతో ప్రత్యేక సమావేశాలను నిర్వహించి, దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యే అంజయ్య యాదవ్తో మంత్రి శ్రీనివాస్గౌడ్ కలిసి ప్రచారం చేస్తున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్కు కంచుకోటగా ఉన్న కొత్తూరు మున్సిపాలిటీ ప్రస్తుతం గులాబీమయమైంది. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ నేతలు టీఆర్ఎస్లో చేరారు. కొత్తూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో వార్ వన్సైడ్ అనేలా గులాబీ శ్రేణులు దూసుకెళ్తున్నాయి. దేశంలో ఎక్కడాలేని విధంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తుండడం, కొత్తూరును మున్సిపాలిటీగా ఏర్పాటు చేసి ఆయా గ్రామాల కలను నెరవేర్చడం, పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయడంతో సబ్బండ వర్ణాల ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి జై కొడుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రతిపక్షాల పోటీ నామమాత్రమే కాగా, కాంగ్రెస్, బీజేపీలు కేవలం పరువు కోసమే పోటీ చేస్తుండడం గమనార్హం.
కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి..
కొత్తూరు మున్సిపాలిటీ రూపురేఖలు మారేలా కనీవినీ ఎరుగని విధంగా అభివృద్ధి జరిగింది. అభివృద్ధికి ఆమడ దూరంగా ఉన్న కొత్తూరుకు ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది. హైదరాబాద్ నగరానికి కూతవేటు దూరంలో ఉన్న కొత్తూరు అభివృద్ధిని గత పాలకులు విస్మరించడంతో అభివృద్ధికి నోచుకోలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం పట్టణాలు, గ్రామాల్లో అభివృద్ధి పరుగులు పెడుతున్నాయి. రోడ్లు, రోడ్ల వెడల్పు, అండర్ డ్రైనేజీ, ఇంటింటికీ తాగునీరు, సెంట్రల్ లైటింగ్, ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్-వెజ్ మార్కెట్ తదితర అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. కొత్తూరు జంక్షన్ అభివృద్ధికీ ఇటీవల పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ నిధులు మంజూరు చేసినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. రైల్వే సౌకర్యంతోపాటు బెంగళూరు జాతీయ రహదారికి అనుకొని ఉన్న కొత్తూరు మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధిలోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించింది. కొత్తూరు మున్సిపాలిటీ అభివృద్ధికి దాదాపు రూ.15 కోట్ల నిధులు విడుదల చేసింది. మున్సిపల్ కార్యాలయ నిర్మాణానికి రూ.3.50 కోట్లు, కొత్తూరు జంక్షన్ అభివృద్ధికిగాను రూ.1.50 కోట్లు, అండర్ డ్రైనేజీ ఏర్పాటుకు రూ.1.87 కోట్లు, సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.70 లక్షలు, ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్వెజ్ మార్కెట్ ఏర్పాటుకుగాను రూ.2 కోట్ల నిధులను ప్రభుత్వం ఇచ్చింది. ప్రతీ ఇంటికి సంక్షేమ పథకం ఫలాలందుతుండడం గమనార్హం. 2020-21 ఆర్థిక సంవత్సరానికిగాను కల్యాణలక్ష్మి పథకం నుంచి 176 మందికి, షాదీ ముబారక్ పథకం ద్వారా 17 మందికి లబ్ధి చేకూరింది. రైతుబంధుతో 582 మంది రైతులకు రూ.48,70,453లు, రైతుబీమా కింద మృతిచెందిన 40 మంది రైతు కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసి ప్రభుత్వం అండగా నిలిచింది.
సబ్బండ వర్ణాల మద్దతు టీఆర్ఎస్కే…