పుణె, జూలై 31: సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) చైర్మన్ డాక్టర్ సైరస్ పూనావాలా ప్రతిష్ఠాత్మక లోక్మాన్య తిలక్ జాతీయ అవార్డు -2021కి ఎంపికయ్యారు. ‘కొవిడ్-19 మహమ్మారి వేళ కొవిషీల్డ్ వ్యాక్సిన్ తయారుచేయడం ద్వారా ఎంతోమంది ప్రాణాలు కాపాడేందుకు పూనావాలా పడిన కష్టానికిగాను ఈ పురస్కారం అందిస్తున్నాం’ అని లోక్మాన్య తిలక్ ట్రస్ట్ అధ్యక్షుడు దీపక్ తిలక్ శుక్రవారం ప్రకటించారు. ఆగస్టు 13న అవార్డు, రూ.లక్ష నగదు బహుమతితోపాటు జ్ఞాపికను అందజేయనున్నట్టు పేర్కొన్నారు.