నాలుగేండ్లలో 1500 స్వచ్ఛంద సంస్థలకు వారధిగా నిలిచారు. రూ.70 కోట్ల క్రౌడ్ ఫండ్ సమకూర్చి వేలాది మందికి భరోసాగా మారారు. మరీ ముఖ్యంగా కరోనా కాలంలో ఏకంగా రూ.55 కోట్లు సమకూర్చారు. రోగులకు కావాల్సిన వైద్య సామగ్రి అందించారు. తాజాగా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్తో పాటు వైద్య పరికరాలను ఇంటి వద్దకే పంపిణీ చేసేందుకు నడుం బిగించారు డొనేట్ కార్ట్(DONATE KART) సభ్యులు. ఇందులో భాగంగా సైబరాబాద్ పోలీసులు, సొసైటీ ఫర్ సైబరాబాద్ కౌన్సిల్తో ఒప్పందం చేసుకున్నారు.
ప్రాణవాయువు కావాలని కోరుతూ మా వెబ్సైట్లో అనేక విజ్ఞప్తులు వస్తున్నాయి. వాటిని అందించేందుకు మా వంతుగా ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటి వరకు హైదరాబాద్లో ఐసొలేషన్లో ఉన్న వారికి 200 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను అందించాం. సైబరాబాద్ పోలీసులు, సొసైటీ సైబరాబాద్తో కలిసి ప్రభుత్వ దవాఖానల్లో వెంటిలేటర్లు, ఆక్సిజన్ సిలిండర్లు కాన్సన్ట్రేటర్లు అందించేందుకు క్రౌడ్ ఫండింగ్ మొదలు పెట్టాం. దాతలతో పాటు సాయం పొందిన వారి వివరాలను మా వెబ్సైట్లో పొందుపరుస్తున్నాం. ఎవరైనా సాయం చేయాలనుకుంటే మా వెబ్సైట్ ద్వారా నేరుగా బాధితులను చేరుకోవచ్చు. -సందీప్ కుమార్, డొనేట్ కార్ట్ వ్యవస్థాపకుడు