న్యూఢిల్లీ: పన్ను చట్టాల సవరణ బిల్లుకు ఇవాళ లోక్సభ ఆమోదం తెలిపింది. దీంతో రెట్రో ట్యాక్స్కు బ్రేక్ వేస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇంధన, ఎనర్జీ సంస్థలతో పన్ను వివాదాలు నెలకొన్న నేపథ్యంలో.. పన్ను చట్టాల సవరణ బిల్లును నిన్న లోక్సభలో ప్రవేశపెట్టారు. రెట్రో ట్యాక్స్ విధానం వల్ల భారత ప్రభుత్వానికి మిలియన్ల డాలర్ల రూపంలో నష్టం వస్తున్నది. అంతేకాదు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ను కూడా ఆ ట్యాక్స్ విధానం పెట్టబడుల లక్ష్యాన్ని దెబ్బతీస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడింది.
మేం ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా రెట్రో ట్యాక్స్ విధానాన్ని వ్యతిరేకించామని కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ బిల్లు చర్చ సమయంలో తెలిపారు. హై లెవల్ కమిటీ ద్వారా ఈ సమస్యను పరిష్కరిస్తామని గతంలో మాజీ మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారని ఆమె సభకు వెల్లడించారు. రెట్రో విధానంలో కొత్త కేసులు ఏమీ లేవని, కెయిర్న్ ఎనర్జీ.. వోడాఫోన్ కేసుల్లో తుది ఒప్పందం కోసం ప్రయత్నిస్తున్నామని మంత్రి తెలిపారు. రెట్రోస్పెక్టివ్ పన్ను విధానాన్ని బీజేపీ నమ్మదన్నారు.
రెట్రో ట్యాక్స్ రద్దు అంశం చాలా కాలం నుంచి పెండింగ్లో ఉందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సరైన సమయంలో నిర్ణయం తీసుకుందన్నారు. కొత్త పన్ను చట్టాల సవరణ బిల్లు ఆహ్వానించదగ్గ చర్య అని శక్తికాంత్ దాస్ తెలిపారు.