భువనగిరి అర్బన్, జూలై13: జిల్లాలోని అధికారులు సమన్వయంతో పనిచేసి జాతీయ బోదకాలు, నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ పమేలాసత్పతి అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జాతీయ బోదకాలు, నులిపురుగుల నివారణ కార్యక్రమంపై మంగళవారం కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. వైద్య ఆరోగ్యశాఖ చేపడుతున్న వ్యాక్సినేషన్, ఇతర వ్యాధి నివారణ చర్యలపై ప్రజలకు నమ్మకం కలిగించాలని సూచించారు. బోధకాల నివారణ కోసం డీఈసీ, అల్బెండజోల్ మాత్రలను అధికారు లు, డాక్టర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు భాగస్వాములై వేసుకోవాలన్నారు.
మూడు రోజులపాటు ఇంటింటికీ తిరిగి మా త్రలను పంపిణీ చేసి ప్రతి ఇంటికి విధిగా కార్యక్రమం పూర్తయినట్లు గుర్తింపుకోసం స్టిక్కర్ వేయాలని జిల్లా వైద్యాధికారికి సూచించారు. ప్రభుత్వ, ప్రైవేట్ విభాగాల్లో వారందరూ మాత్రలను వేసుకోవాలన్నారు. క్యూలెక్స్ దోమ కాటుతో ఈ వ్యాధి సోకుతున్నందున ముఖ్యంగా మురుగు కాలువలు, ఇతర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్లు ప్రత్యేక పారిశుధ్య చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈనెల 15, 16, 17 తేదీల్లో ఇంటింటికీ తిరిగి బోదకాలు, నులిపురుగుల నివారణ కోసం డీఈసీ, అల్బెండజోల్ మాత్రలను రెండేం డ్లు పైబడిన వారందరికీ పంపిణీ చేయనున్నట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ సాంబశివరావు తెలిపారు. సమావేశంలో డిప్యూటీ జిల్లా వైద్యాధికారి డాక్టర్ శిల్పశ్రీ, ప్రోగ్రాం అధికారి డాక్టర్ రామయ్య, వివిధ సంక్షేమ శాఖల అధికారులు, వైద్యాధికారులు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.
ప్రజలకు అవగాహన కల్పించాలి
బోదకాలు, నులిపురుగుల నివారణపై గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టి ప్రజలు నివారణ మాత్రలు వేసుకునేలా చూడాలని ఎంపీపీ నిర్మలావెంకటస్వామి అన్నారు. మండల టాస్క్ఫోర్స్ కమిటీ ఆధ్వర్యంలో మం గళవారం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించి బోదకాల నివారణ మాత్రల పంపిణీపై మండల స్థాయి అధికారులకు వైద్యాధికారి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడుతూ బోదకాల నివారణపై గ్రామాల్లో ఆశ వర్కర్లు, అంగన్వాడీ సిబ్బందికి అవగాహ న కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బీరుమల్లయ్య, ఎంపీడీవో నాగిరెడ్డి, ఎంపీవో, అంగన్వాడీ టీచర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.