కొనసాగుతున్న కాళేశ్వర పథకం ఎత్తిపోతలు..
పర్యవేక్షిస్తున్న నీటి పారుదల శాఖ అధికారులు
పెద్దపల్లి, జూన్ 25(నమస్తే తెలంగాణ)/ ధర్మారం/ రామడుగు/మల్యాల/బోయినపల్లి/తిమ్మాపూర్ : ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. లింక్-1 లక్ష్మీ పంపుహౌస్లోని 12 పంపులను ఆన్చేసి 25,200 క్యూసెక్కుల నీటిని ఎగువన గల సరస్వతీ బరాజ్లోకి తరలిస్తున్నారు. ఇక్కడి సరస్వతీ పంపు హౌస్లోని 9 పంపులను ఆన్చేసి 26,370 క్యూసెక్కుల నీటిని పార్వతీ బరాజ్లోకి ఎత్తిపోస్తున్నారు. ఇక్కడ పార్వతీ పంపుహౌస్లోని 10పంపులను ఆన్చేసి 26,100 క్యూసెక్కుల నీటిని ఎల్లంపల్లి జలాశయంలోకి ఎత్తిపోస్తున్నారు. అలాగే ధర్మారం మండలం నంది మేడారంలోని లింక్-2లోని తొలి పంపు హౌస్ నందిలో ఏడు పంపులకు గానూ ఆరింటిని ఆన్చేసి 18,900 క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేస్తున్నారు. ఇక్కడి నుంచి కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్లోని గాయత్రీ పంపు హౌస్లో 6 పంపులను ఆన్చేసి 18,900 క్యూసెక్కుల నీటిని రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండ లం శ్రీరాజరాజేశ్వర జలాశయానికి ఎత్తిపోస్తున్నారు. నీటి పారుదల శాఖ రామగుండం ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు ఎప్పటికప్పుడు జలాల తరలింపును పర్యవేక్షిస్తున్నారు. శ్రీరాజరాజేశ్వర జలాశయానికి గాయత్రీ పంప్హౌస్ నుంచి 16,550 క్యూసెక్కులు వస్తుండగా, ఇక్కడినుంచి ఎల్ఎండీ కి అంతేమొత్తంలో విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. శ్రీరాజరాజేశ్వర జలాశయం నుంచి వస్తున్న గోదావరి జలాలతో ఎల్ఎండీ కళకళలాడుతోంది. 24.034 టీఎంసీల సా మర్థ్యం గల ఈ రిజర్వాయర్లో ప్రస్తుతం 18.239 టీఎంసీలుండగా పైనుంచి 18,900 క్యూసెక్కులు ఇన్ఫ్లో వస్తున్న ది. తాగునీటి అవసరాలకు ఎల్ఎండీ నుంచి 319 క్యూసెక్కులు అవుట్ఫ్లో రూపంలో వెళ్తున్నట్లు అధికారులు తెలిపారు.