చెన్నై : కొవిడ్-19 వ్యాప్తిని అరికట్టేందుకు ఏకైక పరిష్కారం మార్గం లాక్డౌన్ మాత్రమే అని తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే.స్టాలిన్ అన్నారు. కొవిడ్ చైన్ను తెచ్చేందుకు లాక్డౌన్ మాత్రమే పరిష్కారం అని ఇది ఇంతకుక్రితమే నిరూపణ అయినట్లు ఆయన తెలిపారు. ఏదేమైనా ఇది పౌరుల చేతుల్లోనే ఉందని మంగళవారం జరిగిన వర్చువల్ సమావేశంలో సీఎం పేర్కొన్నారు. ప్రభుత్వం విధించిన నిబంధనలకు ప్రజలు కట్టుబడి ఉండాల్సిందిగా స్టాలిన్ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
సంపూర్ణ లాక్డౌన్ ఫలితాలను ఇవ్వడం ప్రారంభించిందన్నారు. ఇందుకు చెన్నై కార్పొరేషన్, కొయంబత్తూర్లే ఉదాహరణ అని చెప్పారు. లాక్డౌన్కు ముందు చెన్నైలో ప్రతిరోజు 7 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతుండే అదే లాక్డౌన్ సమయంలో ఈ సంఖ్య 2 వేలకు పడిపోయిందన్నారు.
సంపూర్ణ లాక్డౌన్ సమయంలో ప్రజలు ప్రభుత్వానికి సహకరించాల్సిందిగా స్టాలిన్ కోరారు. కిరాణా, కూరగాయలు, పాలు, ఇతర అవసరమైన వస్తువులను ఇంటి వద్దే అందించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. రేషన్ షాపులు కూడా తెరిచే ఉంటాయన్నారు. రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు కొవిడ్ లైఫ్ కిట్లను అందిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ప్రతిరోజు 3 లక్షల మంది వ్యాక్సినేషన్ పొందుతున్నట్లు తెలిపారు. అదేవిధంగా 1.75 లక్షల పరీక్షలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.