కోల్కతా: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసిందే. అయిదే ఆమె తాజాగా తన ఇన్స్టాగ్రామ్ పోస్టులో బేబీ బంప్ ఫోటోను అప్డేట్ చేసింది. ఇక దానికి ఓ క్యాప్షన్ కూడా ఇచ్చింది. పింక్ సాలువా కప్పుకున్న నుస్రత్.. దయ అన్నింటినీ మార్చేస్తుందని ఆ కామెంట్లో తెలిపారు. ఇటీవల ఆమె ప్రెగ్నెన్సీ వార్తలు వివాదానికి తెరలేపిన విషయం తెలిసిందే. ఎంపీ నుస్రత్ జహాన్ 2019లో నిఖిల్ జైన్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్నారు. కానీ ఆ వివాహం భారతీయ చట్టం ప్రకారం జరగలేదని, దానికి గుర్తింపులేదని ఆమె ఇటీవలే వెల్లడించారు. జైన్తో ఏర్పడ్డ విబేధాల వల్ల నుస్రత్ ప్రెగ్నెన్సీ వార్తలు గుప్పుమన్నాయి.
భర్త జైన్తో తానెన్నెడో విడిపోయానని, కానీ దాని గురించి తానెప్పుడూ మాట్లాడలేదని, ఎందుకంటే వ్యక్తిగత జీవితాన్ని బయట చర్చించలేమని, మేం వేరుపడ్డ అంశం ఆధారంగా ఎవరూ మమ్మల్ని ప్రశ్నించలేరని ఇటీవల జహాన్ అన్నారు. నిఖిల్ జైన్ అక్రమరీతిలో తన అకౌంట్ నుంచి డబ్బులు విత్డ్రా చేసినట్లు కూడా ఆమె ఆరోపించారు. ప్రస్తుతానికి నుష్రత్ ప్రెగ్నెంట్ అని, మరీ చాన్నాళ్ల నుంచి దూరంగా ఉంటే ఇదెలా సాధ్యం అన్న ప్రశ్నలు ఇటీవల తలెత్తాయి. ఆ నేపథ్యంలో నుష్రత్ ఆ ప్రకటన చేశారు.