స్టార్ హీరోల సినిమాలు వస్తే మన ప్రేక్షకులు వైరస్ ఉందనే విషయాన్ని కూడా మరిచిపోతారు. తెలుగులో పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా దీన్ని నిరూపించింది. ఇప్పుడు తమిళనాట కూడా ఇదే జరుగుతుంది. అక్కడ హీరో ధనుష్ నటించిన కర్ణన్ సినిమా ఈ మధ్య విడుదలైంది. అప్ కమింగ్ డైరెక్టర్ మరి సెల్వరాజ్ తెరకెక్కించిన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. సినిమా చూసిన వాళ్ళందరూ అద్భుతం అనే మాటకు తగ్గడం లేదు. ధనుష్ కెరీర్ లో ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో కర్ణన్ ది బెస్ట్ అంటున్నారు. అంత గొప్ప రెస్పాన్స్ తెచ్చుకున్న సినిమాకు కలెక్షన్లు కూడా అలాగే వస్తాయి కదా. ఇప్పుడు ఇదే జరుగుతుంది.
తమిళనాడులో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నా ధనుష్ సినిమా కలెక్షన్స్ కూడా అలాగే వస్తున్నాయి. సినిమా విడుదలైన మొదటి రోజు 100% ఆక్యుపెన్సీతో మొదలైంది. కానీ రెండో రోజు నుంచి కేవలం 50 శాతం ఆక్యుపెన్సీతోనే ఈ సినిమా రన్ అవుతుంది. దానికి కారణం పెరుగుతున్న కేసులు. తొలి రోజు తమిళనాడు వ్యాప్తంగా 11 కోట్ల గ్రాస్ వసూలు చేసింది ఈ సినిమా. రెండో రోజు 50 శాతం ఆక్యుపెన్సీతోనే 6 కోట్లకు పైగా వసూలు చేయడం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్య పరుస్తుంది.
ఆ తర్వాత మూడు, నాలుగు రోజుల్లో కూడా దాదాపు 4 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది ఈ సినిమా. ఇప్పటికీ మంచి వసూళ్లు సాధిస్తుంది.తొలి 5 రోజుల్లో దాదాపు 40 కోట్ల గ్రాస్ వసూలు చేసింది ధనుష్ కర్ణన్. వాస్తవిక సంఘటనల ఆధారంగా చేసుకొని హార్డ్ హిట్టింగ్ స్క్రీన్ ప్లేతో ఈ సినిమాను తెరకెక్కించాడు మరి సెల్వరాజ్. కేవలం ఒక సినిమా ఎక్స్పీరియన్స్ ఉన్న ఈ దర్శకుడు ధనుష్ లాంటి స్టార్ హీరోను స్క్రీన్ పై చూపించిన విధానానికి అభిమానులు ఫిదా అయిపోతున్నారు. ఏదేమైనా కూడా ఒక వైపు కరోనా వైరస్ విలయ తాండవం చేస్తున్న సమయంలోనూ చెన్నై బాక్సాఫీస్ దగ్గర ధనుష్ రుద్ర తాండవం చేస్తున్నాడు.
అమితాబ్ తో సినిమా చేస్తున్నానంటే నమ్మలేదు: రష్మ…
చీరలో రుక్మిణి స్టంట్స్ వీడియో వైరల్
సలార్, కెజిఎఫ్ 2లపై అప్ డేట్
కిల్లింగ్ లుక్స్తో చంపేస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ
మురుగదాస్ పాన్ ఇండియా సినిమా..!
పవన్ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్
బాక్సింగ్ రింగ్లోకి వరుణ్తేజ్
ఇంట్రెస్టింగ్గా ఉన్న ఖిలాడి టీజర్