ముంబై, ఏప్రిల్ 21: కరోనా ఉద్ధృతి నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం మరిన్ని ఆంక్షలు విధించింది. నగరాల మధ్య, జిల్లాల మధ్య రాకపోకలను నిలిపివేసింది. కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వ కార్యాలయాలు 15 శాతం సిబ్బందితో పనిచేయాలని బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. అత్యవసర సేవలకు మినహాయింపునిచ్చింది. గురువారం రాత్రి 9 గంటల నుంచి మే 1న ఉదయం 7 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. 50 శాతం పరిమితితోనే వాహనాలు నడవాల్సి ఉంటుంది. ప్రైవేట్ బస్సుల్లో ప్రయాణించేవారు తమ గమ్యస్థానం చేరాక.. ఇంట్లో 14 రోజులపాటు క్వారంటైన్లో ఉండాలి. వివాహాది శుభకార్యాలకు 20 మందికే అనుమతి ఉంటుంది. వేడుకలు 2 గంటలకు మించి పొడిగించకూడదు.