పాట్నా: బీహార్లో మరో వారం రోజుల పాటు లాక్డౌన్ను పొడిగించారు. జూన్ ఒకటో తేదీ వరకు లాక్డౌన్ను పొడిగిస్తున్నట్లు ఆ రాష్ట్ర సీఎం నితీశ్ కుమార్ తెలిపారు. ఇవాళ ఆయన తన ట్విట్టర్ అకౌంట్లో ఈ అంశాన్ని పోస్టు చేశారు. కరోనా వైరస్ సంక్రమణ జోరుగా ఉన్న నేపథ్యంలో.. మే 5వ తేదీన మూడు వారాల పాటు బీహార్లో లాక్డౌన్ ప్రకటించారు. ఆ లాక్డౌన్ 25వ తేదీ ముగియాల్సి ఉన్నది. అయితే ఇవాళ మళ్లీ మంత్రిమండలి సమావేశం జరిగిందని, అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించామని, లాక్డౌన్ వల్ల మంచి పరిణామాలు చోటుచేసుకున్నాయని, కరోనా సంక్రమణ కొంత తగ్గిందని, ఇక వైరస్ను పూర్తిగా నియంత్రించేందుకు మరోసారి లాక్డౌన్ పెట్టాలని నిర్ణయించినట్లు సీఎం నితీశ్ తన ట్వీట్లో తెలిపారు.