పశ్చిమ బెంగాల్లో బీజేపీ డబుల్ డిజిట్ దాటదు.. ఒకవేళ దాటితే ఎన్నికల వ్యూహకర్తగానే పనిచేయను.. ఇది ఎన్నికల ముందు అమిత్ షాకు ప్రశాంత్ కిశోర్ విసిరిన సవాల్. చెప్పిన మాట ప్రకారమే ప్రశాంత్ కిశోర్ ( Prashant Kishor ) తన పంతం నెగ్గించుకున్నాడు. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ 200కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో దూసుకెళ్తుంటే.. బీజేపీ మాత్రం 80 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. కేవలం పశ్చిమ బెంగాల్లోనే కాదు.. ప్రశాంత్ కిశోర్ ఏ రాష్ట్రంలో అడుగుపెడితే అక్కడ తన సత్తా చాటుతున్నాడు. తాను పనిచేసిన పార్టీకి తిరుగులేని విజయాన్ని సాధించిపెడుతూ రాజకీయ చాణక్యుడిగా సంచలనాలు సృష్టిస్తున్నాడు.
ప్రశాంత్ కిశోర్ ఏదైనా రాష్ట్రంలో పనిచేస్తున్నాడంటే అక్కడి ప్రత్యర్థులు గెలుపు ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రెండేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ తరఫున వ్యూహకర్తగా పనిచేసి ప్రత్యర్థి పార్టీ టీడీపీని చిత్తుగా ఓడించాడు. వైసీపీకి తిరుగులేని విజయాన్ని అందించాడు. అంతకుముందు ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్లో అమరీందర్ సింగ్కు వ్యూహకర్తగా పనిచేసి వారి గెలుపులో కీలక పాత్ర పోషించాడు. 2014 ఎన్నికల్లో మోదీకి కూడా ఈయనే వ్యూహకర్తగా పనిచేయడం గమనార్హం. తాజాగా పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) కి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసి రాజకీయ ప్రత్యర్థులకు ముచ్చమెటలు పట్టించాడు.
పశ్చిమ బెంగాల్లో తనదైన శైలిలో వినూత్న క్యాంపెయిన్లతో ప్రశాంత్ కిశోర్ టీమ్ ముందు నుంచి చురుగ్గా వ్యవహరించింది. ప్రజల మనసులో మమతా బెనర్జీపై ఒక రకమైన సానుకూలతను తీసుకురావడంలో సఫలమైంది. ఆ వ్యూహాలే మమతా బెనర్జీకి అదనపు బలంగా మారింది. ఆ వ్యూహాలే మమతా బెనర్జీని ఘన విజయం దిశగా దూసుకెళ్లేలా చేశాయి. ఏదేమైనా రాజకీయాల పరంగా ప్రశాంత్ కిశోర్ ఒక ట్రెండ్ సృష్టిస్తున్నాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇక ఎన్నికల వ్యూహకర్తగా పని చేయను: ప్రశాంత్ కిశోర్
మమతదే ఈ విజయం.. ఆత్మపరిశీలన చేసుకుంటాం: బీజేపీ ప్రధాన కార్యదర్శి
దీదీ హ్యాట్రిక్ కు కలిసొచ్చిన అంశాలివే..
Stalin : నాన్న లేడు.. అన్న అండ లేదు.. అయినా గెలిపించాడు
సాగర్ రిజల్ట్.. తండ్రి మెజార్టీని అధిగమించిన తనయుడు..
తిరుపతిలో ‘ఫ్యాన్’ జోరు.. 2.3 లక్షల మెజార్టీతో గురుమూర్తి ఘనవిజయం