కోల్ కతా : కొవిడ్-19 వ్యాప్తిని అడ్డుకునేందుకు అమలవుతున్నలాక్డౌన్ ను జూన్ 15 వరకూ పొడిగిస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం శనివారం నిర్ణయించింది. లాక్డౌన్ నియంత్రణలతో కరోనా కేసులు తగ్గడంతో వీటిని మరికొన్ని వారాలు పొడిగించాలని బెంగాల్ రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించడంతో ప్రభుత్వం ఈ దిశగా నిర్ణయం తీసుకుంది.
బెంగాల్ లో లాక్డౌన్ ను వచ్చే నెల 15 సాయంత్రం ఆరు గంటల వరకూ పొడిగిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ప్రకటనలో పేర్కొంది. కొవిడ్ నిబంధనలను ప్రజలు విధిగా పాటిస్తూ కరోనా వ్యాప్తిని అడ్డుకోవాలని కోరింది. జూట్ మిల్లుల్లో షిఫ్ట్ కు 40 శాతం సిబ్బందితో కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది.