కాచిగూడ, ఏప్రిల్ 4: అంబర్పేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిచేస్తూ, మౌలిక సదుపాయలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపా రు. గోల్నాక డివిజన్లోని సంజయ్గాంధీనగర్, ఖాజాగరీబ్నగర్లో డ్రైనేజీ సమస్య, లోప్రెషర్ వాటర్తో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే స్థానిక కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్గౌడ్తో కలిసి ఆయా బస్తీల్లో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బస్తీలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. అనంతరం డివిజన్లోని పలు ప్రాంతాల్లో అధికారులతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. స్థానికుల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ మొత్తం అభివృద్ధి పథంలో దూసుకు పోతున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో దూసరి శ్రీనివాస్గౌడ్, డివిజన్ అధ్యక్షుడు భరత్రాజ్ముదిరాజ్, లక్ష్మణ్, యా దగిరి, జ్ఞానేశ్వర్, కాలేరు రామకృష్ణ, సతీశ్, ప్రభాకర్ముదిరాజ్, కాలేరురాజు, సాయి, లక్ష్మిముదిరాజ్, పల్లవి తదితరులు పాల్గొన్నారు.