హైదరాబాద్ : నగర పరిధిలోని వ్యాపారులు తమ ట్రేడ్ లైసెన్సులను పునరుద్ధరించుకునేందుకు రేపటి వరకు తుది గడువు ఉందని జీహెచ్ఎంసీ తెలిపింది.
ట్రేడ్ లైసెన్సు పునరుద్ధరించుకోకుంటే ఆలస్య రుసుముతోపాటు లైసెన్స్ ఫీజుకు అదనంగా అపరాధ రుసుము వసూలు చేయనుంది.
ట్రేడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తే 100శాతం జరిమానా విధిస్తామని హెచ్చరించింది. మొదటి నెలకు లైసెన్స్ ఫీజుపై 10 శాతం జరిమానా విధిస్తామని అధికారులు తెలిపారు.
పౌరులు కొత్త ట్రేడ్ లైసెన్సులకూ దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ట్రేడ్ లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు మరిన్ని వివరాలకు ghmc.gov.inలో చూడాలని కోరారు.