చెన్నై: ఈనెల ఆరంభంలో తమిళనాడులోని వాండలూర్ అరిగ్నార్ అన్నా జులాజికల్ పార్క్లో తొమ్మిది సింహాలకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ కాగా, మరికొన్ని వైరస్ వల్ల మృతిచెందిన విషయం తెలిసిందే. మొత్తం తొమ్మిది సింహాలలో నాలుగు సింహాలకు డెల్టా వేరియంట్(B.1.617.2) వైరస్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ శాస్త్రవేత్తలు వైరస్ బారినపడిన నాలుగు సింహాల నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ చేశారు. ఈనెల 3న నీలా అనే తొమ్మిదేళ్ల ఆడ సింహం మృతి చెందగా, జూన్ 16న పద్మనాథన్ అనే 12 ఏండ్ల సింహం మరణించింది.