వర్ధన్నపేట, ఏప్రిల్ 22: గోసంపద రైతులకు ఎంతో మేలు చేస్తుందని తెలంగాణ రాష్ట్ర గోశాల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్అగర్వాల్ అన్నారు. పట్టణానికి చెందిన 10 మంది రైతులకు ఒక్కొక్కరికి రెండు చొప్పున 20 లేగదూడెలను గురువారం ఆయన ఉచితంగా పంపిణీ చేశారు. రైతులు సేంద్రియ వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు గాడిపెల్లి రాజేశ్వర్, ప్రతినిధులు బదావత్ యాకూబ్, కుల్ల కొమ్మాలు, దాసరి ఆంజనేయులు, రామచంద్రు, వంగాల యాదగిరి, చంద్రు పాల్గొన్నారు.
గోవుల పెంపకంతో ప్రయోజనాలు
రాయపర్తి: వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్న రైతు కుటుంబాలన్నీ పంటల సాగుతోపాటు వ్యవసాయ అనుబంధ పరిశ్రమగా పేరుగాంచిన పశుపోషణను చేపడితే అదనపు ప్రయోజనాలు చేకూరుతాయని తెలంగాణ గోశాలల ఫెడరేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు మహేశ్ అగర్వాల్ తెలిపారు. మండలంలోని ఆరెగూడెంలో స్థానిక నందీశ్వర గోశాల నేతృత్వంలో గ్రామంలోని 10 రైతు కుటుంబాలకు రెండేసి లేగదూడలను ఉచితంగా పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. గోవుల పెంపకం వల్ల రైతులు భవిష్యత్లో తక్కువ ఖర్చుతో సేంద్రియ వ్యవసాయం చేపట్టేందుకు వీలు కలుగుతుందన్నారు. అంతేగాక పాడి కలుగడంతోపాటు ఆశించిన లాభాలు పొందే వీలుంటుందని వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్ పెండ్లి రజినీ, గోశాల అధ్యక్షుడు లావుడ్యా రవీందర్నాయక్, రజిత, ఉప సర్పంచ్ ఎల్లయ్య, కుమారస్వామి, మోహన్, నర్సయ్య, కరుణాకర్, రవీందర్, నర్సయ్య పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
కరోనా కట్టడికి జీహెచ్ఎంసీ సన్నద్ధం
ఏపీలో 10 వేల మార్క్ దాటిన కరోనా పాజిటివ్ కేసులు