అమరావతి :శ్రీశైలం జలాశయం నుంచి అధికారులు మూడుగేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. స్పిల్వే ద్వారా 83,949 క్యూసెక్కుల నీటిని సాగర్కు విడుదల చేస్తుండగా జూరాల, సుంకేశుల నుంచి శ్రీశైలానికి 2,27,284 క్యూసెక్కుల ప్రవాహం వస్తుంది. ఈ జలాశయం పూర్తి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రసుత్తం 884.80 అడుగుల వరకు నీరు ఉంది.
ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్ద్యం 215.80 టీఎంసీలు కాగా 214.36 వరకు టీఎంసీలు నీరు నిల్వ ఉంది. శ్రీశైలం కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేసి 63,418 క్యూసెక్కుల నీటిని సాగర్కు విడుదల చేస్తున్నారు.