National
- Nov 29, 2020 , 06:30:52
VIDEOS
పెన్షనర్లు.. ఫిబ్రవరి 28లోపు లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వొచ్చు

న్యూఢిల్లీ: పెన్షన్ తీసుకుంటున్న విశ్రాంత ప్రభుత్వోద్యోగులు లైఫ్ సర్టిఫికెట్ సమర్పించే గడువును ఈపీఎఫ్ఓ పొడిగించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 28లోపు పెన్షనర్లు ఎప్పుడైన తమ లైఫ్ సర్టిఫికెట్ను సమర్పించవచ్చని ప్రకటించింది. దీంతో 35 లక్షలకుపైగా పెన్షనర్లకు ఊరట లభించనుంది. పెన్షనర్లు ఏటా నవంబర్లోగా లైఫ్ సర్టిఫికెట్ను సమర్పించాల్సి ఉంటుంది. నేరుగా ఈపీఎఫ్ఓ కార్యాలయాలు, సంయుక్త సేవా కేంద్రాలు, పెన్షన్ డిస్బర్సింగ్ బ్యాంకులు, పోస్టల్ నెట్వర్క్, జేపీపీ పోర్టల్ ద్వారా వీటిని సమర్పించవచ్చు. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ నెలాఖరుకల్లా లైఫ్ సర్టిఫికెట్ను చాలామంది సమర్పించలేని పరిస్థితి నెలకొన్నది. దీంతో ఈ నెల 30 వరకున్న గడువును మరో మూడు నెలలు పొడిగిస్తున్నట్లు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజావార్తలు
- రెండు రోజులు మినహా మార్చి మొత్తం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల సేవలు
- కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ సాధనకు ఇక సమరమే
- మహేష్ బాబుపై మనసు పడ్డ బాలీవుడ్ హీరోయిన్
- డెస్క్టాప్లోనూ వాట్సాప్ వీడియో.. వాయిస్ కాల్.. ఎలాగంటే!
- ఫిట్నెస్ టెస్టులో రాహుల్, వరుణ్ ఫెయిల్!
- మహిళను కొట్టి ఆమె పిల్లలను నదిలో పడేసిన ప్రియుడు
- బీజేపీకి మంత్రి కేటీఆర్ హెచ్చరిక
- గోల్కొండ కీర్తి కిరీటం..కుతుబ్షాహీ టూంబ్స్
- న్యాయవాద దంపతుల హత్య కేసులో ఏ-5 నిందితుడు అరెస్ట్
- సీరియస్ దర్శకులంతా ఒకేసారి..
MOST READ
TRENDING