ఢిల్లీ ,మే 7: ప్రభుత్వరంగ జీవిత బీమా కంపెనీ ఎల్ఐసీ వారానికి ఐదు రోజులు మాత్రమే పని చేయనుంది. ఇక పైన శనివారం ఎల్ఐసీ కార్యాలయాలు పని చేయవని ఆ సంస్థ పబ్లిక్ నోటీసులో పేర్కొంది. మే 10వ తేదీ నుంచి ఐదు రోజుల పని విధానం అమలులోకి రానుంది. ఎల్ఐసీ ఉద్యోగులకు సంబంధించి కొన్ని డిమాండ్ల పరిష్కారంలో భాగంగా ప్రతి శనివారం సెలవు ప్రకటించాలనే డిమాండ్కు ఏప్రిల్ 15వ తేదీన ఆమోదం తెలిపింది.
ఈ నేపథ్యంలో మే 10వ తేదీ నుంచి వర్కింగ్ డేస్ మారనున్నాయి. సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే ఎల్ఐసీ కార్యాలయాలు పని చేస్తాయి. ఆయా రోజుల్లో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పని చేస్తాయని ఎల్ఐసీ తెలిపింది. పాలసీదారులు, ఇతర భాగస్వామ్యపక్షాలు దీనిని గమనించాలని సూచించింది.