డెహ్రాడూన్: కొత్తగా నియమితుడైన ఉత్తరాఖండ్ బీజేపీ అధ్యక్షుడు మదన్ కౌశిక్కు పోలీసులు గార్డ్ ఆఫ్ హానర్తో స్వాగతం పలికారు. హరిద్వార్ ఎమ్మెల్యే అయిన ఆయనను ఈ నెల 12న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడ్ని చేశారు. ఈ నేపథ్యంలో మదన్ కౌశిక్ సోమవారం హెలికాప్టర్లో బాగేశ్వర్ వచ్చారు. ఈ సందర్భంగా హెలీప్యాడ్కు సమీపంలో ఆయనకు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. దీనిపై వివాదం చెలరేగడంతో బాగేశ్వర్ డీఐజీ నీలేష్ ఆనంద్ భర్నే వివరణ ఇచ్చారు. పోలీస్ సిబ్బంది తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల ఇలా జరిగిందని తెలిపారు.