భోపాల్: భారతదేశంలో చిరుతపులి చివరిసారిగా 1947లో ఛత్తీస్గఢ్లో కనిపించింది. దేశంలో చిరుతలు అంతరించి పోయాయి అని ప్రభుత్వం 1952లో ప్రకటించింది. 70 ఏండ్ల తర్వాత భారత్లో చిరుతలు మళ్లీ కనిపించనున్నాయి. నవంబర్లో మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్కులోకి చిరుతలను తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు ఆ రాష్ట్ర అటవీ శాఖ మంత్రి విజయ్ షా ఆదివారం చెప్పారు. ‘ప్రాజెక్టు చీతా’ కింద దక్షిణాఫ్రికా నుంచి 10 చిరుతపులులను ఇండియాకు తీసుకురానున్నారు. చిరుత పులులను తిరిగి ఇండియాలో ప్రవేశపెట్టేందుకు వైల్డ్లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కొన్నేండ్లుగా ప్రయత్నిస్తున్నది.