Leopard | ఘజియాబాద్ చిరుతపులి కలకలం సృష్టించింది. కోర్టు ఆవరణలోకి ప్రవేశించిన చిరుతపులి.. పలువురిపై దాడి చేసింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అటవీశాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని బాధితులను ఆసుపత్రికి తరలించి, చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సమాచారం ప్రకారం.. సీజేఎం కోర్టు కార్యాలయం వద్ద చిరుత పులి పోలీస్పై దాడి చేసి గాయపరిచింది. ఆ తర్వాత ఐఎంటీ వైపు నుంచి అకస్మాత్తుగా కోర్టులోకి ప్రవేశించింది. అనంతరం మొదటి అంతస్తులోని చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టులోకి దూరింది. చిరుత పులిని చూసిన వారంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. కోర్టు ఆవరణ అంతా గందరగోళంగా మారింది. ఆ తర్వాత పోలీసులు, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. కోర్టు హాలుకు చేరుకొని చిరుతను బంధించేందుకు ప్రయత్నిస్తున్నారు.