సిద్దిపేట జోన్, ఏప్రిల్ 22: ‘సిద్దిపేట అభివృద్ధిని ఐదేండ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం మీ ఇంటి వాకిళ్లలో నిలిపింది.. ప్రజల అభివృద్ధిని పార్టీలకతీతంగా కాంక్షించేది టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కటే’నని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. గురువారం సిద్దిపేటలో జరిగిన కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకుడు ఎల్లు రవీందర్రెడ్డి వందమంది అనుచరులతో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి పాల్గొన్నారు.