న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: ప్రఖ్యాత న్యాయకోవిదులు, మాజీ అటార్నీ జనరల్ సోలీ సొరాబ్జీ (91) కరోనాతో కన్నుమూశారు. ఢిల్లీలోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, ప్రధాని మోదీ, సుప్రీంకోర్టు మాజీ జడ్జి బీ సుదర్శన్ రెడ్డి తదితరులు ఆయన మృతికి ప్రగాఢ సంతాపం ప్రకటించారు. 1930లో ముంబైలో జన్మించిన సొరాబ్జీ.. 1953లో బాంబే హైకోర్టులో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. 1975లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు మానవహక్కులు, మీడియా స్వేచ్ఛ కోసం పోరాడారు. 1998-2004 మధ్య ఐరాస మానవహక్కుల పరిరక్షణ ఉపసంఘానికి చైర్మన్గా వ్యవహరించారు. 1989లో ఆయన తొలిసారి అటార్నీ జనరల్గా నియమితులైన ఆయన.. 1998లో మరోసారి బాధ్యతలు చేపట్టారు. సొరాబ్జీ సేవలను గుర్తించిన కేంద్రం పద్మవిభూషణ్తో సత్కరించింది.
సీఎం కేసీఆర్ సంతాపం
సోలీ సొరాబ్జ్జీ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.