సిమ్లా: హిమాచల్ ప్రదేశ్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఓ రోడ్డుపై వాహనాలు వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఆ కొండరాళ్ల మధ్య ట్రక్కు, బస్సు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. రిక్కాంగ్ పియో-షిమ్లా జాతీయ రహదారిపై ఉన్న కిన్నౌర్ వద్ద ఈ ఘటన జరిగింది. ఇవాళ మధ్యాహ్నం 12.45 నిమిషాలకు కొండచరియలు విరిగిపడినట్లు ఐటీబీపీ తెలిపింది. ఇటీవల కురుస్తున్న వర్షాల వల్ల.. హిమాచల్ ప్రదేశ్లో పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డ విషయం తెలిసిందే. అయితే ఇవాళ్టి ఘటనలో ఎంత మంది మృతిచెందారో ఇంకా తెలియలేదు. శిథిలాల కింద ఓ ట్రక్కు, బస్సుతో పాటు ఇతర వాహనాలు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. రెస్క్యూ ఆపరేషన్ కోసం ఇండో-టిబెట్ బోర్డర్ పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు.