బర్మెర్: అత్యవసర సమయాల్లో రోడ్డుపైనే యుద్ధ విమానాలను ల్యాండింగ్ చేయడానికి వీలుగా మార్పులు చేసిన రాజస్థాన్లోని సట్టా-గాంధవ్ స్ట్రెచ్ను రక్షణమంత్రి రాజ్నాథ్, కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ గురువారం ప్రారంభించారు. రాజస్థాన్లోని బర్మేర్ జిల్లాలోని 925 జాతీయ రహదారిపై 3 కిలోమీటర్ల పొడువుతో ఈ స్ట్రెచ్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వాయుసేన నిర్వహించిన డ్రిల్లో హెర్క్యులస్ సీ-130జే విమానం స్ట్రెచ్పై దిగింది. దీంట్లో రాజ్నాథ్, గడ్కరీతో పాటు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ ప్రయాణించారు.