ల్యాండ్ అటాక్ వర్షన్.. అండమాన్ దీవుల్లో బ్రహ్మోస్ మిస్సైల్ పరీక్ష

హైదరాబాద్: బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ను ఇవాళ భారత్ విజయవంతంగా పరీక్షించింది. అండమాన్ నికోబార్ దీవుల్లో ఈ పరీక్ష జరిగినట్లు తెలుస్తోంది. మరో దీవిలో ఉన్న టార్గెట్ను ఆ మిస్సైల్ ధ్వంసం చేసింది. ల్యాండ్ అటాక్ వర్షన్కు చెందిన బ్రహ్మోస్ క్షిపణిని పరీక్షించినట్లు తాజాగా వెల్లడైంది. అయితే ఈ పరీక్షకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా అందాల్సి ఉన్నది. సూపర్సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ను ఇవాళ ఉదయం 10 గంటలకు పరీక్షించారు. అత్యంత విజయవంతంగా టార్గెట్ను ఆ క్షిపణి ధ్వంసం చేసినట్లు అధికారులు తెలిపారు. భారతీయ ఆర్మీ నేతృత్వంలో ఆ పరీక్ష జరిగింది. డీఆర్డీవో అభివృద్ధి చేసిన మిస్సైల్ వ్యవస్థను ఆర్మీ వినియోగిస్తోంది. బ్రహ్మోస్ క్షిపణి స్ట్రయిక్ రేంజ్ను 400 కిలోమీటర్లకు పెంచినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
తాజావార్తలు
- చెన్నైలోనే ఐపీఎల్ -2021 వేలం!
- వాట్సాప్ కు ధీటుగా సిగ్నల్ ఫీచర్స్...!
- పెట్టుబడులకు తెలంగాణ అనుకూలం : మంత్రి కేటీఆర్
- ఇక మొబైల్లోనే ఓటరు గుర్తింపు కార్డు
- ఎయిర్పోర్ట్లో రానా, మిహీక
- చిరుతను చంపి.. వండుకుని తిన్న ఐదుగురు అరెస్ట్
- పాయువుల్లో బంగారం.. పట్టుబడ్డ 9 మంది ప్రయాణికులు
- వాళ్లను చూస్తే కాజల్కు మంటపుడుతుందట..
- జైలు నుంచి భూమా అఖిలప్రియ విడుదల
- పది మంది ఉగ్రవాదులపై ఎన్ఐఏ చార్జిషీట్