న్యూఢిల్లీ : ఆర్జేడీ చీఫ్, బీహార్ మాజీ సీఎం లాలు ప్రసాద్ యాదవ్ తన 74వ జన్మదిన వేడుకలను గురువారం ఢిల్లీలో నిరాడంబరంగా జరుపుకున్నారు. రాజ్యసభ ఎంపీ, లాలు కుమార్తె మీసా భారతి నివాసంలో జరిగిన ఈ బర్త్డే వేడుకల్లో కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు. లాలు కేక్ కట్ చేసిన ఫోటోలను మీసా భారతి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. దాణా కుంభకోణం కేసులో లాలు బెయిల్పై విడుదలైన విషయం విదితమే. లాలు పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ తండ్రి బర్త్డే వేడుకలను పాట్నాలో నిర్వహించారు. 74 మొక్కలను నాటారు. రక్తదానం శిబిరాన్ని ఏర్పాటు చేశారు.