పాట్నా : జనతాదళ్ (యునైటెడ్) జాతీయాధ్యక్షుడిగా రాజీవ్రంజన్ సింగ్ అలియాస్ లాలన్సింగ్ (Lalan Singh elected JD(U) national President) నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన నియమాకాన్ని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ శనివారం సాయంత్రం ప్రకటించారు. న్యూఢిల్లీ జంతర్ మంతర్లోని పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ముంగేర్ నుంచి ఎంపీగా ఉన్న లాలన్సింగ్.. నితీష్ కుమార్ ప్రధాన అనుచరుడిగా ఉన్నారు. రామచంద్ర ప్రసాద్ స్థానంలో లాలన్సింగ్ను నియమించారు. కేంద్ర మంత్రివర్గ విస్తరణలో రామచంద్ర ప్రసాద్కు మంత్రి పదవి లభించింది. దాంతో జేడీ(యూ) జాతీయాధ్యక్ష పదవికి లాలన్సింగ్ను నియమించడం అనివార్యమైంది.
1980 ల నుంచి నితీష్ కుమార్కు నమ్మిన వ్యక్తిగా లాలన్సింగ్ ఉన్నారు. ఇటీవల స్వతంత్ర ఎమ్మెల్యే సుమిత్ కుమార్ సింగ్తోపాటు ఎల్జేపీ ఏకైక ఎమ్మెల్యే రాజ్ కుమార్ సింగ్ను జేడీయూలోకి తీసుకువచ్చిన ఘనత లాలన్సింగ్దే. చిరాగ్ పాశ్వాన్ నుంచి పార్టీ నాయకత్వాన్ని పశుపతి నాథ్ పరాస్ లాక్కోవడం ద్వారా ఎల్జేపీని విచ్ఛిన్నం చేయడం వెనుక సూత్రధారులలో ఒకరిగా లాలన్సింగ్ కూడా ఉన్నారని రాజకీయ నిపుణులు చెప్తుంటారు. ఇలాఉండగా, లాలన్ సింగ్ కేంద్ర క్యాబినెట్ పదవికి ముందు వరుసలో ఉండి.. జేడీయూ జాతీయ అధ్యక్ష పదవి అనే కన్సోలేషన్ ప్రైజ్తో సరిపెట్టుకోవాల్సి వచ్చిందని రాజకీయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా: బాబుల్ సుప్రియో
ఇవి తింటే డయాబెటీస్ రాదంటా..! అవేంటంటే..?
కొడుకు ఫస్ట్ బర్త్డే.. విషెస్ చెప్పిన హార్దిక్, నటాషా
అమ్మకు ప్రేమతో.. తల్లితో అనుష్క శెట్టి
పద్మశ్రీ అవార్డుకు వైజాగ్ కళాకారుడు నామినేట్
వాట్సాప్పై కేసు పెట్టిన రష్యా.. ఎందుకంటే..?
45 నిమిషాలపాటు నియంత్రణ కోల్పోయిన ఐఎస్ఎస్
టర్కీ అడవిలో దావానలం.. 20 గ్రామాలు తరలింపు
వైద్యరంగంలో సంచలనం.. తల్లి గర్భంలోనే గర్భం దాల్చిన శిశువు
చరిత్రలో ఈరోజు.. మొబైల్ ఫోన్లకు 26 ఏండ్లు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..