బంజారాహిల్స్,ఏప్రిల్ 3: దంపతుల మధ్య గొడవల తో.. భార్య తరపు బంధువులు స్తంభానికి కట్టేసి కొట్టా రు.. తీవ్ర మనస్తాపం చెందిన ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మూడు రోజుల తర్వాత దుర్వాసన రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసులు, బంధువుల వివరాల ప్రకారం..
రహ్మత్నగర్ డివిజన్, ఎస్పీఆర్ హిల్స్ సమీపంలోని అంజయ్యనగర్కు చెందిన దూసుముక్కు లక్ష్మణ్(26) పెయింటర్. ఏడాది క్రితం ఎల్లమ్మబండ సమీపంలోని తెల్లాపూర్కు చెందిన భవానీతో వివాహం అయింది. వీరికి 25 రోజుల పాప. పెండ్లినాటి నుంచి భార్య కుటుంబంతోనే ఉంటూ.. అప్పుడప్పుడూ రాజీవ్గాంధీనగర్లో ఉన్న బాబాయ్ ఇంటికి వచ్చిపోతుండేవాడు. కాగా.. కొన్ని నెలలుగా భార్య భవానీతో లక్ష్మణ్కు గొడవలు జరుగుతున్నాయి.
పనికిపోవడం లేదంటూ భవానీ సూటిపోటి మాటలు మాట్లాడటంతోపాటు ఆమె కుటుంబ సభ్యులు కూడా లక్ష్మణ్ను దు ర్భాషలు ఆడుతుంటారు. ఈ నేపథ్యంలో గత నెల 31న పాప 21 రోజుల ఫంక్షన్ రోజున దంపతులకు గొడవలు జరిగాయి. భవానీ తల్లి నర్సమ్మ, చిన్నమ్మ ఉలిగమ్మ, మేనమామ ఆనంద్ తదితరులు లక్ష్మణ్తో గొడవపడ్డారు. కోపంతో బాగా మద్యం సేవించిన లక్ష్మణ్.. తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు .. దీంతో అతడిని అక్కడే స్తంభానికి కట్టేసి కొట్టారు.. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై.. మరుసటిరోజు తెల్లవారుజామున ఉదయం బాత్రూమ్కు వెళ్తున్నానంటూ చెప్పి అక్కడినుంచి తప్పించుకుని.. రాజీవ్గాంధీనగర్లోని బాబాయ్ ఇంటికి వచ్చాడు. తనను కట్టేసి కొట్టడంతో పాటు తీవ్ర అవమానానికి గురిచేశారంటూ లక్ష్మణ్ కన్నీళ్లపర్యంతమయ్యాడు.
వాళ్లతో మాట్లాడదామని, ఆందోళన వద్దంటూ బాబాయ్, పిన్ని తదితరులు నచ్చజెప్పారు. కాసేపటికి బయటకు వెళ్తున్నానని చెప్పిన లక్ష్మణ్.. అదే ఇంటి కింద ఖాళీగా ఉన్న షట్టర్లోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని ఎవరూ గమనించలేదు. శనివారం షట్టర్లోనుంచి దుర్వాసనలు వస్తుండటంతో లోనికి వెళ్లి చూడగా కుళ్లిపోయిన స్థితిలో లక్ష్మణ్ మృతదేహం కనిపించింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.