ఆపరేషన్కు రూ.2.5 లక్షల ఎల్వోసీ మంజూరు
గంభీరావుపేట, మార్చి 31: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ నిరుపేద యువకుడి చికిత్సకు మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అండగా నిలిచారు. ఆపరేషన్ కోసం రూ.2.50 లక్షల ఎల్వోసీని మంజూరు చేయించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం సముద్ర లింగాపూర్కు చెందిన మానుగ మహేశ్ (23) మార్చి 22న గ్రామ శివారులో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. కుటుంబీకులు కరీంనగర్లోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. పరీక్షించిన వైద్యులు మెదడులో రక్తం గడ్డకట్టిందని నిర్దారించారు. ఆపరేషన్కు రూ.3 లక్షలు ఖర్చవుతుందని చెప్పారు. అంత డబ్బు కట్టలేక దిక్కుతోచని స్థితిలో మహేశ్ను ఇంటికి తీసుకొచ్చారు. అతని దయనీయస్థితిని తెలుసుకున్న స్థానిక టీఆర్ఎస్ నాయకులు విషయాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన మంత్రి.. సీఎం సహాయనిధి కింద రూ.2.50 లక్షల ఎల్వోసీ మంజూరుచేయించారు. సంబంధిత మంజూరు పత్రాలను స్థానిక టీఆర్ఎస్ నాయకులు బుధవారం మహేశ్ కుటుంబీకులకు ఇంటి వద్ద అందజేశారు. ఎల్వోసీ మంజూరు చేయించిన మంత్రి కేటీఆర్కు మహేశ్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
ఎఫ్సీఐ కావాలనే ఇబ్బంది పెడుతున్నది
ఆటో వద్దనే భూమి రిజిస్ట్రేషన్
రామాయణం, భారతం ప్రపంచానికే తలమానికం
మన పల్లె ప్రగతికి 12 పురస్కారాలు
స్వచ్ఛ సర్వేక్షణ్లో హైదరాబాద్షా