న్యూఢిల్లీ, అక్టోబర్ 8: భారత ప్రధాన ఆర్థిక సలహాదారుగా(సీఈఏ) కేవీ సుబ్రమణియన్ మూడేండ్ల పదవీకాలం డిసెంబర్తో ముగియనున్నది. తర్వాత ఆయన తిరిగి ప్రొఫెసర్ వృత్తిని కొనసాగించనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. సీఈఏగా ఆయనను మరికొంత కాలం కొనసాగించాలని కేంద్రం భావిస్తున్నప్పటికీ ఆయన అందుకు సుముఖంగా లేనట్టు తెలుస్తున్నది. ఐఎస్బీ హైదరాబాద్లో ప్రొఫెసర్గా ఉన్న సుబ్రమణియన్ను 2018 డిసెంబర్లో కేంద్రప్రభుత్వం భారత ప్రధాన ఆర్థిక సలహాదారుగా నియమించింది.