బెంగాల్లో దోస్తీ కేరళలో కుస్తీనా..?: కాంగ్రెస్, వామపక్షాలపై కేంద్ర మంత్రి ఫైర్

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఎజెండాతో ఉంటుందని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీతోపాటే పలు ఇతర పార్టీలు కూడా రెండు నాల్కల ధోరణినే అవలంభిస్తున్నాయని ఆయన విమర్శించారు. ఒక్క బీజేపీ మాత్రమే దేశంలోని ఏ ప్రాంతంలోనైనా ఒకే నినాదంతో, ఒకే ఎజెండాతో పనిచేస్తున్నదని చెప్పారు. మంగళవారం ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రహ్లాద్ జోషి మాట్లాడారు.
'ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటములు కేరళలో కుస్తీకి దిగుతాయి. ఈ రెండు కూటముల్లోని ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, వామపక్షాలు ఢిల్లీ, బెంగాల్, బీహార్ తదితర రాష్ట్రాల్లో దోస్తీ చేస్తాయి. మమతాబెనర్జీ కూడా అంతే, ఢిల్లీలో కాంగ్రెస్కు మద్దతిస్తారు. బెంగాల్లో కుస్తీ పడుతారు. ఇదేం విచిత్రం..? ఈ పార్టీల ఎజెండా ఏమిటి..? ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఎందుకు వ్యవహరిస్తున్నాయి...? ఈ రెండు నాల్కల ధోరణి ఎందుకు..? ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి విచిత్రమైన రాజకీయాలు ఏమిటి?' అని ప్రహ్లాద్ జోషి ప్రశ్నించారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- నేడు ఎంజీఆర్ మెడికల్ వర్సిటీ స్నాతకోత్సవం.. ప్రసంగించనున్న ప్రధాని
- 60 వేల నాణెలతో అయోధ్య రామాలయం
- నానీని హగ్ చేసుకున్న ఈ బ్యూటీ మరెవరో కాదు..!
- సర్కారు పెరటి కోళ్లు.. 85 శాతం సబ్సిడీతో పిల్లలు
- కరోనా కట్టడికి నైట్ కర్ఫ్యూ
- గోమాతలకు సీమంతం.. ప్రత్యేక పూజలు
- కూతురి కళ్లెదుటే.. తండ్రిని కత్తులతో పొడిచి చంపారు
- ‘పెట్రో’ ఎఫెక్ట్.. రూ.12 పెరగనున్న పాల ధర!
- రాజన్న హుండీ ఆదాయం రూ. 40.56 లక్షలు
- నయనతార పెళ్లిపై క్రేజీ గాసిప్..!