నిజాంసాగర్/ ఎల్లారెడ్డిరూరల్/ తాడ్వాయి/ బిచ్కుంద/ మద్నూర్/నాగిరెడ్డిపేట్/రామారెడ్డి/ బీర్కూర్/బీబీపేట్/ ఏప్రిల్ 10 : జిల్లావ్యాప్తంగా కరోనా నిర్ధారణ టెస్టులను వైద్య సిబ్బంది విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ దవాఖానల్లో 45 ఏండ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ వేశారు. ఎల్లారెడ్డి మండలపరిధిలోని మత్తమాల పీహెచ్సీలో శనివారం 145 మందికి, వెల్లుట్లపేటలో 95 మందికి వ్యాక్సిన్ వేసినట్లు మత్తమాల మెడికల్ ఆఫీసర్ వెంకటస్వామి తెలిపారు. 110 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 15 పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిపారు. మండలకేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో 11 మందికి సెకండ్ డోస్ వ్యాక్సిన్, 161 మందికి మొదటి డోస్ వ్యాక్సిన్ వేశామని దవాఖాన సిబ్బంది తెలిపారు. 91 మందికి ర్యాపిడ్ టెస్టులు చేయగా.. 31 మందికి పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు.
తాడ్వాయి మండలంలోని ఎర్రాపహాడ్ పీహెచ్సీలో 130 మందికి వ్యాక్సిన్ వేసినట్లు వైద్యాధికారి రవీందర్రెడ్డి తెలిపారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 89 మందికి టెస్టులు నిర్వహించగా.. ఐదుగురికి పాజిటివ్ వచ్చినట్లు మండల వైద్యాధికారి తెలిపారు.
నిజాంసాగర్ ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన ర్యాపిడ్ టెస్టుల్లో నిజాంసాగర్ నవోదయ పాఠశాలకు చెందిన 13 మందికి, గాయత్రీ ఫ్యాక్టరీలో 11 మందికి, నిజాంసాగర్లో ఇద్దరికి, మల్లూర్లో ఒకరికి మొత్తం 27 మందికి పాజిటివ్ వచ్చినట్లు మండల వైద్యాధికారి రాధాకిషన్ తెలిపారు. నిజాంసాగర్, మహ్మద్నగర్ గ్రామాల్లో కలిపి మొత్తం 256 మందికి వ్యాక్సిన్ వేశామని చెప్పారు. బిచ్కుంద మండలకేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో 81 మందికి టీకాలు వేశారు. గ్రామాల్లో ఏఎన్ఎంలు కరోనా టీకాపై ప్రజలకు అవగాహన కల్పించారు. మద్నూర్ మండలంలో 35 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యసిబ్బంది తెలిపారు. మండలంలోని డోంగ్లి పీహెచ్సీలో 50 మందికి టెస్టులు నిర్వహించగా.. చిన్నఎక్లారా గ్రామానికి చెందిన 20 మందికి, మద్నూర్ సీహెచ్సీలో 38 మందికి టెస్టులు నిర్వహించగా.. 15 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యుడు అశ్విన్బాబు తెలిపారు.
మహారాష్ట్ర నుంచి వచ్చేవారికి సలాబత్పూర్ చెక్పోస్టు వద్ద నిత్యం స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 129 మందికి స్క్రీనింగ్ చేయగా 22 మంది అనుమానితులకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించామని.. అందరికీ నెగెటివ్ వచ్చిందని తెలిపారు. చిన్నఎక్లారా గ్రామంలో నాలుగురోజుల్లోనే కొవిడ్ కేసుల సంఖ్య 142కు చేరుకుందని, గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నాగిరెడ్డిపేట్ మండలంలోని మాల్తుమ్మెద, గోపాల్పేట్ గ్రామాల్లో 209 మందికి వ్యాక్సిన్ వేశామని వైద్యురాలు నందిత తెలిపారు. మండలంలో 21 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఆమె తెలిపారు.
రామారెడ్డి మండలం అన్నారం గ్రామంలోని ప్రభుత్వ దవాఖానలో 53 మందికి ర్యాపిడ్ టెస్టులు నిర్వహించగా.. ఒకరికి పాజిటివ్ వచ్చినట్లు మెడికల్ ఆఫీసర్ రాము తెలిపారు. 189 మందికి టీకా వేసినట్లు చెప్పారు. రామారెడ్డి దవాఖాన పరిధిలోని రంగంపేట గ్రామంలో డాక్టర్ షాహిద్ అలీ ఆధ్వర్యంలో, రామారెడ్డి ప్రభుత్వ దవాఖానలో మొత్తం 190 మందికి కరోనా పరీక్షలను నిర్వహించగా.. అందరికీ నెగెటివ్ వచ్చినట్లు డాక్టర్ షాహిద్అలీ తెలిపారు. 142 మందికి టీకా వేశామని వైద్యసిబ్బంది తెలిపారు. బీర్కూర్, నస్రుల్లాబాద్ మండలాల్లో 24 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు మండల వైద్యాధికారి రవిరాజా తెలిపారు. హోం క్వారంటైన్లో ఉన్న వారికి ఆరోగ్య సిబ్బందితో కలిసి పలు సూచనలు చేశారు.
బీబీపేట్ మండలకేంద్రంలోని పీహెచ్సీలో 303 మందికి కరోనా వ్యాక్సిన్ వేసినట్లు హెచ్ఈవో శంకర్ తెలిపారు. 50 మందికి కరోనా పరీక్షలు చేయగా.. ఐదుగురికి పాటిజివ్గా నిర్ధారణ అయ్యిందని తెలిపారు. పాజిటివ్ వచ్చిన వారిలో జనగామకు చెందిన నలుగురు, బీబీపేటకు చెందిన ఒకరు ఉన్నారని వివరించారు.
పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బందికి టీకాలు..
మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో కలెక్టర్ ఆదేశాల మేరకు కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని శనివారం ప్రారంభించారు. వైద్యసిబ్బంది పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బందికి టీకాలు వేశారు. మొత్తం 137 మందికి టీకాలను వేశామని వైద్యులు హరికృష్ణ, హరీశ్కుమార్ తెలిపారు. వ్యాక్సినేషన్ కేంద్రాన్ని జిల్లా పంచాయతీ అధికారి సాయన్న, జడ్పీసీఈవో సాయాగౌడ్ వేర్వేరుగా పరిశీలించారు. వైద్యసిబ్బంది టీకా వేస్తున్న తీరును పరిశీలించారు. వారివెంట ఎంపీడీవో పూర్ణచంద్రోదయ్ కుమార్, ఎంపీవో రాజ్కిరణ్రెడ్డితో పాటు, పంచాయతీ అధికారులు, వైద్యసిబ్బంది ఉన్నారు.