మహబూబాబాద్ : సీఎం కేసీఆర్ అపర భగీరథుని వలే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చుతూ సాగునీరు, తాగునీరు అందిస్తున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
ఎస్సారెస్సీ ద్వారా జిల్లాలోని తన స్వగ్రామం గుండ్రాతి మడుగుకు నీళ్లు వచ్చే కాలువ డీఎం -40లో వేదమంత్రాల సాక్షిగా నేడు జల హారతితో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..‘‘జీవిత కల కల నెరవేరింది.
ఈ సంతోషం మాటల్లో చెప్పలేనిది. ఈ కలను నిజం చేసిన అపర భగీరథుడు సీసిఎం కేసీఆర్కు ఎంతో రుణపడి ఉంటాం.’’ మంత్రి భావోద్వేగానికి గురయ్యారు. ఈ కాలువ ద్వారా గుండ్రాతి మడుగు, నారాయణపురం, మొగిలిచర్ల గ్రామాలకు నీళ్లు ఇచ్చి కలను నిజం చేశారన్నారు.
కార్యక్రమంలో జిల్లా జడ్పీ చైర్ పర్సన్ కుమారి ఆంగోతు బిందు, స్థానిక జడ్పీటీసీ బండి వెంకట్ రెడ్డి, టీఆర్ఎస్ నేతలు కొంపల్లి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ రెడ్డి, శ్రీరాం నాయక్, వేణుగోపాల రెడ్డి, సురేష్ రావు, ఇతర నాయకులు, నేతలు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
రైతులకు సాగునీటి సమస్యలు రానీయొద్దు
కారు కొనివ్వలేదని యువకుడి ఆత్మహత్య
పంచలోహ విగ్రహాల దొంగల అరెస్ట్