హైదరాబాద్ : వర్ధమాన మహావీరుని జయంతిని పురస్కరించుకొని రాష్ర్ట ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. శాంతి, సహనం, సమ్యక్ జ్ఞానం అనే అంశాలను మానవాళికి బోధించిన మహావీరుని జీవిత సందేశం అందరికీ ఆదర్శం అని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ జైన, బౌద్ధ ఆరామాలకు నెలవుగా ఉంది. జైనం తెలంగాణ గడ్డ మీద పరిఢవిల్లింది. జైన తీర్థంకరుల పాదముద్రలతో తెలంగాణ నేల పావనమైంది. దేశానికి స్వాతంత్ర్యం సాధించిన గాంధీజీ శాంతి మార్గానికి స్ఫూర్తి వర్ధమాన మహావీరుని బోధనలే కారణం అని సీఎం అన్నారు. తెలంగాణ సాధన పోరాటంలో సబ్బండ వర్గాలు శాంతి, సహనం అనుసరించాయి. కరోనా సమయం మానవ జాతికి ఒక పరీక్షా సమయం. మహావీరుని బోధనల స్ఫూర్తితో, సహనంతో వ్యవహరించాలి. స్వీయ కట్టుబాట్లు, నిబంధనలను అనుసరిస్తూ కరోనాను జయిద్దాం అని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.
ఇవికూడా చదవండి..