గ్రామస్థుల సమక్షంలో అప్పగించిన మావోయిస్టులు
కొత్తగూడెం క్రైం, ఏప్రిల్ 8: ఐదు రోజులుగా మావోయిస్టుల వద్ద బందీగా ఉన్న జవాన్ రాకేశ్వర్సింగ్కు గురువారం విముక్తి లభించింది. మావోయిస్టులు గురువారం అతడిని భేషరతుగా విడుదల చేశారు. రాకేశ్వర్ విడుదలకు పద్మశ్రీ అవార్డు గ్రహీత ధర్మపాల్ సైనీ, గోండ్వానా సమాజ్ అధ్యక్షుడు తెలం బోరయ్య మధ్యవర్తిత్వం వహించారు. ఇందులో ఇద్దరు స్థానిక జర్నలిస్టులు కీలకంగా వ్యవహ రించారు. బీజాపూర్, సుక్మా జిల్లాల సరిహద్దులోని దట్టమైన అటవీ ప్రాంతంలో స్థానిక ఆదివాసీల సమక్షంలో సాయుధ నక్సలైట్లు జవాన్ను మధ్యవర్తులకు అప్పగించారు. జవాన్ చేతులను తాళ్లతో బంధించి అక్కడికి అంతకుముందు తీసుకువచ్చారు. విడుదల అనంతరం రాకేశ్వర్ మీడియాతో మాట్లాడుతూ తనకు నక్సలైట్లు ఎటువంటి హాని తలపెట్టలేదని, ఒక ప్రదేశం నుంచి మరో చోటికి తరలించేప్పుడు తన కండ్లకు గంతలు కట్టేవారని తెలిపాడు. ఎన్కౌంటర్ ప్రాంతంలో అపస్మారక స్థితిలో ఉన్న తనను నక్సల్స్ తీసుకెళ్లారని చెప్పాడు.
హిడ్మా వంటి వారి జీవితం చరిత్రలో కలవాల్సిందే!: సీఆర్పీఎఫ్ చీఫ్
జవాన్లపై నక్సలైట్ల దాడికి సూత్రధారిగా భావిస్తున్న మాడ్విహిడ్మా వంటి వారి జీవితం చరిత్రలో కలిసిపోతుందని సీఆర్పీఎఫ్ చీఫ్ కుల్దీప్సింగ్ హెచ్చరించారు. నక్సలైట్ల గాలింపునకు ప్లాన్ను ఇప్పటికే సిద్ధం చేశామని చెప్పారు.
ఇవీ కూడా చదవండీ…
మహిళా సంఘాల సభ్యులు ఆర్థికంగా ఎదగాలి