లక్నో : కొవిడ్ -19 సెకండ్ వేవ్ తో దేశవ్యాప్తంగా వైద్యారోగ్య మౌలిక వసతులపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. నాన్ కొవిడ్ ఎమర్జెన్సీ రోగులకు పడకలు దొరకని పరిస్థితి కనిపిస్తోంది. కిడ్నీ వ్యాధితో బాధపడుతూ వారణాసికి వచ్చిన వినయ్ సింగ్ అనే వ్యక్తి ఆస్పత్రుల చుట్టూ తిరిగినా అడ్మిషన్ లభించకపోవడంతో తల్లి ఎదుటే కన్నమూయడం కలిచివేసింది. ఆపై అంబులెన్స్ జాడ లేక కన్నతల్లే ఈ-రిక్షాలో కుమారుడి మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్లింది. తల్లి చంద్రకళ ఈ రిక్షాలో కొడుకు మృతదేహాన్ని తీసుకువెళుతున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. యూపీలో వైద్య మౌలిక సదుపాయాల దుస్థితికి ఈ ఫోటో అద్దం పడుతోదని పలువురు నెటిజన్లు కామెంట్ చేశారు.